దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండలంలోని గుడితండాలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, చందు నాయక్, వెంకటయ్య గౌడ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.