వైభవంగా అమ్మవారి జయంతి మహోత్సవం

1037చూసినవారు
నల్గొండ జిల్లా దేవరకొండలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శనివారం వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతం, విఘ్నేశ్వర పూజ, 102 కలశములచే పంచామృత అభిషేకం, వాసవిమాత పారాయణం, మహిళలచే సామూహిక కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయకమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్