ఒక్క దపాలో రెండు లక్షల రుణమాఫీ హర్షణీయం: సైదయ్య

65చూసినవారు
ఒక్క దపాలో రెండు లక్షల రుణమాఫీ హర్షణీయం: సైదయ్య
రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని ఒకే దఫాలో మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించడం హర్షించదగిన విషయమని నాంపల్లి మండల టిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ముదిగొండ సైదయ్య అన్నారు. మండల కేంద్రంలోని సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు.

ట్యాగ్స్ :