అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

76చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం మొసంగిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శ్రీను(40)ను ఆదివారం అదే గ్రామానికి చెందిన సైదాబాబు, శంకర్ లు వర్షం వచ్చేలా ఉందని మిరపకాయలపై పట్టా కప్పేందుకు తీసుకు వెళ్లారు. రాత్రి సైదాబాబు, శంకర్ లు ఇంటికి రాగా, శీను ఇంటికి రాలేదు. సోమవారం గ్రామ శివారులో శ్రీను మృతి చెంది ఉండడాన్ని గ్రామస్తులు గుర్తించారు.

ట్యాగ్స్ :