భారత్పే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆఫీసర్గా నలిన్ నేగీ నియామకమయ్యారు. ఈ మేరకు కంపెనీ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక సీఈవోగా పని చేస్తున్నారు. ఇంతకు ముందు సీఈవోగా పని చేసిన సుహైల్ సమీర్ జనవరి 7న సీఈవో పదవికి రాజీనామా చేశారు. దీంతో తాజాగా కంపెనీ ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. నేగీ 2022లో భారత్పేలో చేరారు. కాగా నేగీ నాయకత్వంలో భారత్పే నిర్వహణ ఆదాయం సుమారు 182 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది.