రమేశ్ రాథోడ్ మృతిపై నారా లోకేశ్ సంతాపం

83చూసినవారు
రమేశ్ రాథోడ్ మృతిపై నారా లోకేశ్ సంతాపం
మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ హఠాన్మరణం వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. టీడీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఈ విషాద సమయంలో రమేశ్ రాథోడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.