వేసవి సెలవులను వృధా చేసుకోవద్దు
ఉట్కూర్ మండలంలోని నిడుగుర్తి గ్రామంలో ఎంపియుపియస్ పాఠశాలలో మంగళవారం ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థులకు ప్రగతి నివేదికలు ఇవ్వడం జరిగింది. అలాగే వేసవి సెలవులను ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి, అందుకు తల్లిదండ్రులు నిర్వహించాల్సిన పాత్ర ఏంటి అనే విషయాల పైన కూడా చర్చించడం జరిగింది.