పీఎంఎల్ అధ్యక్షుడిగా మళ్లీ నవాజ్ ఎన్నిక

60చూసినవారు
పీఎంఎల్ అధ్యక్షుడిగా మళ్లీ నవాజ్ ఎన్నిక
పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడిగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ ఎన్నికయ్యారు. లాహోర్ వేదికగా మంగళవారం నిర్వహించిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆయన పేరును ఖరారు చేశారు. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. పనామా పేపర్ల కేసులో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు ఆయన చేతికి వెళ్లడం గమనార్హం.

ట్యాగ్స్ :