ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్లలో 4 గెలిచి 8 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీం ఓనర్ నీతా అంబానీ చేసిన ప్రసంగం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మా అందరినీ నిరాశపరిచింది. అయిన కానీ నేను ఎప్పుడూ ముంబై ఇండియన్స్ టీమ్కి పెద్ద అభిమానిని, ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి జట్టులో చేరడం గౌరవంగా భావిస్తున్నా’ అని ఆమె తెలిపారు.