కర్ణాటకలో నేహా (23)ను కిరాతకంగా హత్య చేసిన ఘటనను పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థిని హత్యకు నిరసనగా ఏప్రిల్ 22 (సోమవారం)న స్థానికంగా బంద్కు పిలుపునిచ్చాయి. బాధిత కుటుంబానికి సంఘీభావంగా తాము బంద్ను పాటిస్తున్నట్లు ధార్వాడ్కు చెందిన అంజుమన్-ఇ-ఇస్లామ్ అధ్యక్షుడు ఇస్మాయిల్ టమట్గర్ వెల్లడించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్లో పాల్గొంటామన్నారు.