![](https://media.getlokalapp.com/cache/21/1f/211fb2f5c7e34dc6acc04ae8f0b0fea6.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
బాసర మండలంలోని బిద్రెల్లి శివారులోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నవిపెట్ కు ఆటోలో మేకల సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన బొగ్గులారి బలంగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మహమ్మద్ ముజిప్ అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ధర్మబాద్ ఆసుపత్రికి తరలించిన్నట్లు తెలిపారు.