బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం ఉదయం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పియూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిచ్చుక అర్వింద్ హస్టల్ గదిలొ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మరణం పట్ల కళాశాల విసి వెంకట రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.