భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

60చూసినవారు
భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
ఉట్నూరు పట్టణంలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గ్రామీణ పేదల సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎల్లయ్య కోరారు. శుక్రవారం సాయంత్రం జన్నారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఆ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. పేదల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 26న ఉట్నూర్ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఆ సభకు అందరూ తరలి రావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్