రాంపూర్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

65చూసినవారు
రాంపూర్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం
జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా వారు సోమవారం ఉదయం ఆ గ్రామంలోని పలు కాలనీలలో పర్యటించి ఇంటింటి ప్రచార చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుగుణను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.