పేద ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ

51చూసినవారు
ఉట్నూర్ పట్టణంలో ఉన్న పేద ముస్లింలకు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. రంజాన్ పండుగ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయన ఉట్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేశారు. మైనార్టీ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఉన్నారు.