మంచి మనసు చాటుకున్న కిరణ్

59చూసినవారు
మంచి మనసు చాటుకున్న కిరణ్
ఉట్నూర్ పట్టణానికి చెందిన బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు కిరణ్ 30వ సారి రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో పాకాల విజయ అనే మహిళ ప్రసవించింది. అయితే ఆ మహిళకు అత్యవసరంగా రక్తం కావాలని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న బొడ్డు కిరణ్ ఉట్నూర్ నుండి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ రక్త దానం చేశారు. దీంతో కిరణ్ ను ఆస్పత్రి వైద్యులు సోమవారం అభినందించారు.

సంబంధిత పోస్ట్