బదిలీపై వెళ్తున్న బ్యాంకు సిబ్బందికి సన్మానం

81చూసినవారు
బదిలీపై వెళ్తున్న బ్యాంకు సిబ్బందికి సన్మానం
ఉత్తమ సేవలతో ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ యోహాను అన్నారు. ఆ బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ బి. శివ దండు మైలారం బ్రాంచ్ కు బదిలీ అయ్యారు. దీంతో ఆయనను బ్యాంకు సిబ్బంది శుక్రవారం సాయంత్రం శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది బి. మహేష్, కె. శిరీష, సాయి తేజ, నితిన్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్