అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తాం

63చూసినవారు
అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తాం
ప్రజల నుండి వచ్చిన అన్ని దరఖాస్తులు పరిష్కరించేలా దృష్టి పెట్టామని ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఉట్నూర్ పట్టణంలోని ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ, గిరిజన ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు ఆదివాసి ప్రజలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్