గురుకుల విద్యార్థి ఐఐటి మద్రాస్ లో సీటు సాధించడం గర్వకారణం

56చూసినవారు
గురుకుల విద్యార్థి ఐఐటి మద్రాస్ లో సీటు సాధించడం గర్వకారణం
ముధోల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థి ఐఐటి మద్రాస్ లో సీటు సాధించడం గర్వకారణం అని మంగళవారం ప్రిన్సిపల్ వేణుగోపాల్ అన్నారు. తాండూరు మండలానికి చెందిన అమన్ పదవ తరగతి వరకు ముధోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. అనతరం గౌలిదొడ్డి సీఓఈలో సీటు సాధించి మొదటి ప్రయత్నంలోనే ఐఐటి మద్రాసులో సీటు సాధించడం సాంఘీక సంక్షేమ గురుకులాలకు గర్వకారణమన్నారు. విద్యార్థిని ఘనంగా సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్