వర్షం జాడలేక రైతుల తిప్పలు

71చూసినవారు
మృగశిర ప్రారంభమైనప్పటి నుండి భైంసా మండలంలో లోటు వర్షపాతం నమోదు అవ్వడంతో రైతులు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలో కరువు చాయలు స్పష్టంగా ఆగుపడుతున్నాయి. అడపాదడప కురిసిన వర్షంతో రైతులు పత్తి విత్తనాలు విత్తగా గత ఎనిమిది రోజుల నుండి వర్షపు జాడ లేకపోవడంతో ఇలేగాం గ్రామ రైతులు బిందెలతో పత్తి మొలకలకు నీళ్లు పోసి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత పోస్ట్