వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో బుదవారం రాత్రి సాయిబాబా నూతన విగ్రహాన్ని ప్రధాన వీధులలో వేద పండితులు రఘురామాచార్యులు ఊరేగింపుగా నూతన సాయిబాబా ఆలయం వరకు మహిళలు మంగళహారతులతో నిర్వహించారు. గురువారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని వేద పండితులు తెలియజేశారు. ఈ కార్యక్రమం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.