ఆన్ లైన్ లో భద్రాద్రి, సీతారాముల తలంబ్రాలు
భద్రాచలంలో ఈ నెల 17న నిర్వహించే శ్రీ సీతా రాముల కళ్యాణం తలంబ్రాలను ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు అందించనున్నామని ఆర్టిసి ఆర్ఎం జానీ రెడ్డి తెలిపారు. ముత్యాలతో కూడిన పాకెట్ ధర 151అని WWW. tsrtclogistics. in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఆఫ్లైన్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ డిపొలలో సంప్రదించాలని ఆర్ఎం జానీ రెడ్డి తెలిపారు.