ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతు సమస్యలు పరిష్కరించాలి

57చూసినవారు
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతు సమస్యలు పరిష్కరించాలి
ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు శోభన్ డిమాండ్ చేశారు. శనివారం బోధన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరప్ప అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకమునుపు మేనిఫెస్టోలో పేర్కొన్న రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలను పరిష్కరించి రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు.