యువతిని మోసగించిన ఎంపీఓ
ప్రేమ పేరుతో మోసం చేసిన ఎంపీఓ కటకటాల పాలయ్యాయడు. ఎడపల్లి ఎంపీఓగా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ అదేశాఖలో పనిచేస్తున్న యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి వలలో వేసుకున్నాడు. యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఇవాలా, రేపు అంటూ దాటేశాడు. అనుమానం వచ్చిన యువతి నిలదీయడంతో పెళ్లికి నిరాకరించాడు. గత నెల 27న యువతి నగరంలోని మూడో ఠాణా పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు రిమాండుకు తరలించారు.