ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి - ఏఐటీయుసీ

64చూసినవారు
ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి - ఏఐటీయుసీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐటీయుసీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈనెల 31న ఏఐటీయుసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టోకు నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్