
నిజామాబాద్: సైబర్ క్రైమ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కమిషనర్ కార్యాలయంలో మంగళవారం సైబర్ క్రైమ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి మాట్లాడుతూ సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందని, సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, సైబర్ క్రైమ్ సిబ్బంది సమర్ధవంతంగా సేవలందించడం లక్ష్యంగా పని చేయాలని సూచించారు.