May 12, 2024, 16:05 IST/బోధన్
బోధన్
మద్యం బాటిల్ల పట్టివేత
May 12, 2024, 16:05 IST
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 11వ తేదీ సాయంత్రం నుంచి మద్యం విక్రయాలు నిలిపివేశారు. ఆదివారం రాత్రి సాలూర మండల కేంద్రంలో మరియు సాలంపాడ్ గ్రామంలో 35 లీటర్ల మధ్యం బాటిల్లను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐ నాగనాథ్ తెలిపారు. మద్యం విక్రయించిన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించరాదని ఎస్సై హెచ్చరించారు.