దేశంలో కుల గణనను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సోషల్ జస్టిస్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కుల గణనపై తాను రాజకీయం చేయడం లేదన్నారు. తన జీవితంలో అది టార్గెట్ అని తెలిపారు. దాన్ని తానేమీ వదలబోమన్నారు. కుల గణనను అడ్డుకునే శక్తి ఏదీలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే, తొలుత తాము కుల గణన చేపట్టనున్నట్లు రాహుల్ వెల్లడించారు.