నో జీరో బిల్.. వినియోగదారుల ఆందోళన

52చూసినవారు
నో జీరో బిల్.. వినియోగదారుల ఆందోళన
TG: రాష్ట్రంలో గృహ జ్యోతి పథకం వర్తించక చాలా మంది వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాపాలన సమయంలో అందజేసిన దరఖాస్తుల్లో వివరాలను అంతర్జాలంలో తప్పుగా నమోదు చేయడంతో సున్నా బిల్లు రావడం లేదు. అధికారులు చేసిన తప్పిదానికి బిల్లు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వివరాలను సరి చేసుకునేందుకు విద్యుత్తు, ఎంపీడీవో, సంబంధిత జిల్లా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం ఉండటం లేదు.

సంబంధిత పోస్ట్