విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్

84చూసినవారు
విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన రూ.180కోట్ల రుణాన్ని ఎగవేసిన కేసుకు సంబంధించి ఈ వారెంట్ జారీ చేసింది. జూన్ 29న మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే దాని ఉత్తర్వు మాత్రం నిన్న అందుబాటులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్