సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఈ సంధర్భంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. ప్రజలందరూ తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో బిజెడి గొప్ప విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.