పారిస్ ఒలింపిక్స్-2024 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే, పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఐదుగురు క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆస్ట్రేలియా క్రీడాకారులకు కొవిడ్ సోకిందని అధికారులు తెలిపారు. వాటర్ పోలో మహిళల జట్టులో ఐదుగురికి కరోనా వచ్చిందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా బృందంలోని మిగిలిన వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే కరోనా బారిన పడిన ఆ ఐదుగురు కూడా క్షేమంగానే ఉన్నారు.