లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా చేశారు. 18వ లోక్సభకు స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయన కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. ఓం బిర్లా 17వ లోక్సభ స్పీకర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా స్పీకర్ పదవి కోసం నామినేషన్లకు జూన్ 25 మధ్యాహ్నం 12 గంటల వరకు తుది గడువు విధించారు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.