నేరవేరని, తప్పుడు హామీలతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత
కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో శనివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "దేశంలోని పార్టీలన్నింటిని కూడగట్టి కూటమి పెడతామని కాంగ్రెస్ బిల్డప్ ఇచ్చింది. కూటమికి బిహార్లో నితీష్ కుమార్ కూడా బైబై చెప్పారు. కేసీఆర్, మమతా బెనర్జీ, పినరయి విజయన్ లాంటివారే నరేంద్ర మోదీని గద్దె దించగలరు." అని వ్యాఖ్యానించారు.