దేశంలో బీజేపీని నిలువరించాలంటే
కాంగ్రెస్ పార్టీతో అవ్వదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ అన్నారు. బీజేపీని ప్రాంతీయ పార్టీలే నిలువరించగలవని స్పష్టం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడారు.
కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరాయి విజయన్ లాంటి వారు మాత్రమే బీజేపీని అడ్డుకోగలరని అన్నారు.