యూపీలోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి చెందడంతో యోగీ సర్కార్ ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలు, కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఉందా లేదా అన్న దానిపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు.