పీఎం కిసాన్ మూడో విడత సాయం సోమవారం జమ కానుంది. బిహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ బటన్ నొక్కి డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. కాగా, గడిచిన ఐదేళ్లలో పీఎం కిసాన్ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.