దేశంలో తండేల్ మూవీ సీన్ రిపీట్ అయింది. పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ జలాల్లో పట్టుబడిన 22 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది. కరాచీలోని మాలిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేశారు. వారందరినీ పాక్ అధికారులు శనివారం రాత్రి వాఘా బార్డర్ వద్ద భారత అధికారులకు అప్పగించనున్నారు. గుజరాత్ తీర గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి.. అనుకోకుండా పాక్ జలాల్లోకి ప్రవేశించారు.