32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ,పోలీసులు

51చూసినవారు
32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ,పోలీసులు
గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 32 కేజీల గంజాయిని మాదాపూర్‌ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం..బానోతు లక్ష్మణ్‌ అనే యువకుడు ఏపీ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :