లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో స్పందిస్తూ తాను బెెంగళూరులో లేనందున సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. ‘బెంగళూరు సీఐడీతో మా న్యాయవాది మాట్లాడారు.. నిజం త్వరలోనే బయటకు వస్తుంది’ అని రేవణ్ణ పేర్కొన్నారు. కాగా లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ప్రజ్వల్ను జేడీఎస్ తమ పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేసింది.