ప్రధాని మోదీ ఇవాళ బిహార్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించనున్నారు. 400 ఎంపీ సీట్లే టార్గెట్గా మోదీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బిహార్లో కూడా లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే మూడు సార్లు ప్రచారం నిర్వహించిన మోదీ.. ఇవాళ మరొకసారి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గయా గాంధీ మైదానంలో మోదీ బహిరంగ సభ జరగనుంది.