ప్రొఫెసర్‌ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట

64చూసినవారు
ప్రొఫెసర్‌ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట
ఇటీవల జైలు నుంచి విడుదలైన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషిన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

సంబంధిత పోస్ట్