మహారాష్ట్రలో వర్షం బీభత్సం.. 14 మంది మృతి

76చూసినవారు
మహారాష్ట్రలో వర్షం బీభత్సం.. 14 మంది మృతి
మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మరఠ్వాడాలోని 7 జిల్లాల్లో జూన్ 1 నుంచి ప్రారంభమైన వర్షాల కారణంగా ఇప్పటివరకు 14 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో పిడుగుపాటు కారణంగా 11 మంది మృతి చెందారు. డివిజనల్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన ప్రాథమిక సర్వే నివేదిక ప్రకారం.. గత రెండు రోజుల్లో పర్భానీ, హింగోలి జిల్లాల్లో 4 మరణాలు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు 14 ఏళ్ల బాలురు కాగా, 40 ఏళ్ల మహిళ కూడా ఉంది.

సంబంధిత పోస్ట్