సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ అన్నారు. శుక్రవారం కొత్తపేట డివిజన్ సమతా పురి కాలనీ కమ్యూ నిటీ హాల్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ నాయి కోటి పవన్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.