కొత్తపేట డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించకుంటే జలమడలి ముట్టడిస్తామని స్థానిక కార్పొరేటర్ నాయికోటి పవన్ హెచ్చరించారు. మారుతినగర్ కాలనీలో సోమవారం కార్పొరేటర్ పర్యటించి డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. పలు కాలనీల్లో డ్రైనేజీ సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.