మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గురించి మాట్లాడే స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేఎల్ఆర్ ది కాదని, కబ్జాల గురించి ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులే పార్టీ గేట్లు ఓపెన్ చేశామని అంటున్నారని, వాళ్లే ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటున్నారని అన్నారు.