కుక్కల దాడిలో జింకపిల్ల మృతి

61చూసినవారు
తప్పిపోయి వచ్చిన జింక పిల్లపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పాల్మాకుల శివారులో ఉన్న ఓ తోట నుంచి గురువారం జింక పిల్ల తప్పిపోయి బయటకు వచ్చింది. దీన్ని కుక్కలు వెంబడించడంతో చాలా దూరం పరుగెత్తి అలిసిపోయిన ఓ చోట కుప్పకూలిపోయింది. తర్వాత కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమివేశారు. అక్కడకు చేరుకున్న అటవీ అధికారులు జింకను పరిశీలించగా అప్పటికే మృతి చెందింది.

సంబంధిత పోస్ట్