ఇంటింటి ప్రచారంలో కారు జోరు కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజలు సైతం కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ వార్డులలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిల్లర్లతో, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ ఏం పి అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించాలనీ ఓటర్లను కోరారు.