
షాద్ నగర్: కందూరి మనోహర్ రెడ్డిని సన్మానించిన పాలమూరు విష్ణువర్ధన్
షాద్ నగర్ నియోజకవర్గం నుండి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన కందూరి మనోహర్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వారి స్వగృహంలో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోహన్ సింగ్, ఇస్నాతి శ్రీనివాస్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.