అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని మొదళ్ళగూడ గ్రామంలోని మైసమ్మ తల్లి మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు.