లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, IRPS అధికారిణి అంజలి బిర్లాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పరువుకు భంగం కలిగించేలా ఉన్న సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని గూగుల్, ఎక్స్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంజలి తన తండ్రి ప్రభావంతో యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే పాసయ్యిందంటూ కొన్ని పోస్టులు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఆ నిరాధారమైన పోస్టులను తొలగించాలంటూ అంజలి హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు సానుకూల తీర్పు ఇచ్చింది.